శ్రీనగర్ : (Terrorist attack) జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు గ్రనేడ్లతో జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ సంఘటన బందిపోరా సంబల్ బస్టాండ్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
సంబల్ బస్టాండ్ సమీపంలోని ఆర్మీ కాన్వాయ్పై ఉదయం 10.20 గంటల సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారి లక్ష్యం తప్పిపోయి రోడ్డు పక్కన పేలింది. పేలుడు ధాటికి పలు వాహనాల అద్దాలు పగిలాయి. పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొన్నది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు. కాగా, ఆదివారం షోపియాన్లోని జైనాపోరాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక కశ్మీరీ పౌరుడు మరణించాడు. మృతుడిని యాపిల్ పండ్ల వ్యాపారి షాహీద్ ఎజాజ్గా గుర్తించారు. గత నెలలో కశ్మీర్ లోయలో 11 మంది పౌరులు మరణించారు.
జియో-బీపీ మొబిలిటీ స్టేషన్లు ప్రారంభం
సూడాన్లో సైనిక తిరుగుబాటు, దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఏడుగురు మృతి
మీ ఎజెండాతో పార్టీకి నష్టం కలిగించకండి: సోనియాగాంధీ
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..