టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా రోహిత్ శర్మ నియామకాన్ని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ సమర్ధించాడు. విండీస్లో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా పేరున్న డారెన్ సామి మాట్లాడుతూ.. రోహిత్ శర్మ చేతుల్లో భారత క్రికెట్ సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
వచ్చే నెల 6వ తేదీ నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇటీవలే భారత జట్టు వన్డే, టీ20 సారధిగా రోహిత్ శర్మను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. విండీస్తో జరిగే సిరీస్ నుంచి రోహిత్ శర్మ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు.
ఈ క్రమంలోనే సామి మాట్లాడాడు. ‘‘ముంబై ఇండియన్స్ సారధిగా రోహిత్ అద్భుతంగా రాణించాడు. మంచి స్ఫూర్తివంతమైన నాయకుడు. ధోనీ, గంభీర్ వంటి సక్సెస్ఫుల్ సారధుల సరసన స్థానం సంపాదించుకున్న వ్యక్తి’’ అంటూ రోహిత్ను మెచ్చుకున్నాడు.