తాష్కెంట్: ఆసియా కప్ ఆర్చరీ టోర్నీలో భారత్ పది పసిడి పతకాలపై గురి పెట్టింది. రికర్వ్, కాంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు తుది పోరులో నిలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పారు. గురువారం జరిగిన వేర్వేరు మ్యాచ్ల్లో మన ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.
మిక్స్డ్ ఈవెంట్ సెమీస్లో భారత ద్వయం మృనాల్ చౌహాన్, సంగీత 5-4తో ఉజ్బెకిస్థాన్పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగే ఫైనల్లో చైనాతో స్వర్ణ పతక పోరులో భారత్ తలపడుతుంది. కాంపౌండ్ మిక్స్డ్ సెమీస్లో అభిషేక్ శర్మ, ప్రణీత్కౌర్ 152-151తో ఇరాక్పై గెలిచి తుది పోరులో నిలిచారు. కజకిస్థాన్తో జరిగే ఫైనల్లో వీరు తలపడుతారు.