WTC | దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భారత్ నంబర్వన్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా 64.58 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిష్టించింది. ఇటీవల రాంచీలో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించగా, మరోవైపు ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓడిపోవడంతో ర్యాంకింగ్ స్థానాలు తారుమారు అయ్యాయి. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లాడిన టీమ్ఇండియా ఐదు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో 64.58 సగటుతో టాప్లోకి వచ్చింది.
సొంతగడ్డపై ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో 172 పరుగుల తేడాతో ఓడిపోవడం 60.00 పాయింట్ల సగటుతో నంబర్వన్ ర్యాంక్ నుంచి రెండో స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా (59.09), బంగ్లాదేశ్ (50.00), పాకిస్థాన్ (36.66), వెస్టిండీస్ (33.33) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ నెల 7 నుంచి ధర్మశాల వేదికగా మొదలయ్యే ఐదో టెస్టులో ఇంగ్లండ్పై భారత్ గెలిస్తే..ర్యాంకింగ్స్ మరింత మెరుగయ్యే అవకాశముంది.