న్యూఢిల్లీ: చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్ 634 మందితో బరిలోకి దిగనుంది. సెప్టెంబర్ 23 నుంచి మొదలవుతున్న ఆసియా క్రీడల్లో పోటీపడే భారత అథ్లెట్ల జాబితాను కేంద్ర క్రీడాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది.
గత జకార్తా(2018) ఆసియా క్రీడల(572)తో పోల్చుకుంటే ఈసారి 62 మంది ఎక్కువగా ఉన్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో అత్యధికంగా 65 మంది అథ్లెట్లు ఉండగా, మహిళల, పురుషుల ఫుట్బాల్ జట్లలో 44 మంది ఉన్నారు.