ఆల్ రయాన్(ఖతార్): ఏఎఫ్సీ ఏషియన్ కప్లో భారత్కు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన గ్రూపు-బి మ్యాచ్లో భారత్ 0-2 తేడాతో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. తొలి అర్ధభాగంలో 50నిమిషాల వరకు ఆసీస్ను గోల్ చేయకుండా అడ్డుకున్న టీమ్ఇండియా అద్భుత పోరాటపటిమ కనబరిచింది. కీలకమైన ద్వితీయార్ధ మొదలైన కొద్దిసేపట్లోనే జాక్సన్ ఇర్విన్ గోల్ ద్వారా ఆసీస్ ఖాతా తెరిచింది.
భారత్ గోల్పోస్ట్పై పదేపదే దాడులు చేసిన ఆసీస్ 73వ నిమిషంలో జోర్డాన్ బాస్ ద్వారా మరో గోల్ అందుకుంది. మొత్తంగా తమ కంటే మెరుగైన ర్యాంక్లో ఉన్న ఆసీస్కు ఇగోర్ స్టిమాక్ నేతృత్వంలోని టీమ్ఇండియా దీటైన పోటీనివ్వడంలో సఫలమైంది. ఈ నెల 18న ఉజ్బెకిస్థాన్తో భారత్ తలపడుతుంది.