హోబర్ట్ (ఆస్ట్రేలియా): ఎఫ్ఐహెచ్ మెన్స్ ప్రో లీగ్ తాజా సీజన్లో 8 మ్యాచ్ల తర్వాత భారత హాకీ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. భారత్లోనే జరిగిన తొలి అంచెలో దారుణ పరాభవాలు చవిచూసిన హార్ధిక్ సింగ్ సేన.. ఆస్ట్రేలియాలోనూ మూడు మ్యాచ్లు ఓడింది. కానీ బుధవారం ఇక్కడ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో 1-1 (3-1)తో ఆస్ట్రేలియాపై గెలిచింది.
నిర్దేశిత సమయంలో ఇరుజట్లూ 1-1తో సమమైనా షూటౌట్లో భారత్ 3 గోల్స్ చేయగా ఆతిథ్య జట్టు ఒక్క గోల్కే పరిమితమైంది. షూటౌట్ సందర్భంగా ఆస్ట్రేలియన్లు యత్నించిన గోల్స్ను భారత గోల్కీపర్ హెచ్ఎస్ మోహిత్ అద్భుతంగా అడ్డుకుని భారత్కు విజయాన్ని అందించాడు. ఈ లీగ్లో తర్వాతి దశ జూన్ నుంచి నెదర్లాండ్స్లో జరుగుతుంది.