Team India : ఒక ఏడాదిలో ఎక్కువ మ్యాచ్లు ఆడిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్తో ఈ సంవత్సరం భారత జట్టు మొత్తం 62 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. దాంతో, ఒక ఏడాదిలో ఎక్కువ మ్యాచ్లు (వన్డేలు, టెస్టులు, టీ 20 లు కలిపి) ఆడిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరు మీద ఉంది. ఆస్ట్రేలియా 2009లో 61 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. న్యూజిలాండ్ పర్యటనకు ముందు 61 మ్యాచ్లతో టీమిండియా, ఆస్ట్రేలియాతో సమంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ భారత జట్టు 39 టీ 2ం మ్యాచ్లు ఆడింది.
అంతేకాదు, ఒక ఏడాదిలో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది. ఈ ఏడాది 62 మ్యాచ్లు ఆడిన భారత జట్టు 43 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ టెస్ట్ల్లో నెంబర్ వన్గా నిలిచింది. రోహిత్ నాయకత్వంలో టీమిండియా స్వదేశంలో వెస్డిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ 20 సిరీస్లలో అద్భుత ప్రదర్శనతో విజయాలు సాధించింది. ఈ ఏడాది టీ 20 వరల్డ్కప్లో ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది.