హైదరాబాద్: వెస్టిండీస్తో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో టీమ్ఇండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి విండీస్ ఆఖరి బంతి వరకూ పోరాడింది. ఈ క్రమంలోనే చివరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా 11 పరుగులు చేసింది. దీంతో చివరి బంతివరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో భారత్ 3 రన్స్ తేడాతో విజయం సాధించింది.
మొదటి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శిఖర్ ధావన్ (97), శుభ్మన్ గిల్ (64) శుభారంభాన్ని ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ 54 అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక విండిస్ ఆటగాళ్లలో కైల్ 75, బ్రాండన్ 54, బ్రూక్స్ 46 పరుగులు చేశారు. అయితే, 39 పరుగులు చేసిన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ రోమారియో షెపర్డ్.. చివర్లో ధాటిగా ఆడి భారత్ను కంగారు పెట్టించాడు. హోసీన్ (33 నాటౌట్)తో కలిసి అతడు విండీస్ను గెలిపించినంత పనిచేశాడు. అయితే, సిరాజ్ ఆఖరి ఓవర్లో కట్టుదిట్టంగా బంతులేసి ఉత్కంఠకర పరిస్థితుల్లో భారత్ను గెలిపించాడు.
India win a thriller to take a 1-0 lead in the three-match ODI series 👏
Watch #WIvIND for FREE on https://t.co/MHHfZPyHf9 (in select regions) 📺| 📝 Full scorecard: https://t.co/vjur84Qla6 pic.twitter.com/n3gCzNySht
— ICC (@ICC) July 22, 2022