India | న్యూఢిల్లీ: భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
లంక నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ మూడు వికెట్లు కోల్పో యి మరో 27 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. పంకజ్, దినేశ్ జట్టు విజయంలో కీలకమయ్యారు. లంక తరఫున చందన దేశ్ప్రియ(76) ఫర్వాలేదనిపించాడు.