T20 World Cup | దుబాయ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్, ఐర్లాండ్ పోరుతో పాటు సెమీఫైనల్ మ్యాచ్ల టికెట్లు ఈ నెల 19న విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరుగనున్న మెగాటోర్నీలో 13 అదనపు మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు వచ్చే వారం అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 37 మ్యాచ్ల టికెట్లను కొనుగోలుకు ఉంచారు. భారత్ తమ తొలి మ్యాచ్లో జూన్ 5న ఐర్లాండ్తో 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడుతుంది. దాయాదుల పోరు టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని ఐసీసీ పేర్కొంది.