Team India | పెర్త్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత హాకీ జట్టుకు ఆస్ట్రేలియా పర్యటనలో చుక్కెదురైంది. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 1-5తేడాతో ఆసీస్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఆసీస్ తరఫున టామ్ హిక్హమ్ (20ని,38ని), టిమ్ బ్రాండ్ (3ని), జోయెల్ రింటాలా(37ని), ప్లిన్ ఓగ్లివి (57ని) గోల్స్ చేశారు.
గుర్జాంత్సింగ్ (47ని) భారత్కు ఏకైక గోల్ అందించాడు. ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన కంగారూలు ఆట మొదలైన మూడో నిమిషంలోనే గోల్ ఖాతా తెరిచాడు. భారత డిఫెన్స్ లోపాలను అనుకూలంగా మలుచుకుంటూ ఆసీస్ వరుస విరామాల్లో గోల్స్ చేసింది.