Indi A vs England Lions : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్( England Lions)తో జరిగిన అనధికారిక రెండో టెస్టులో భారత ఏ జట్టు(Indi A) అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో రోజు ఐదు వికెట్లతో లయన్స్ నడ్డి విరిచిన పేసర్ సౌరభ్ కుమార్(Sourabh Kumar) భారత్ను గెలుపు వాకిట నిలిపాడు.
నాలుగో రోజు 33 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లయన్స్ జట్టును అర్ష్దీప్ సింగ్, యశ్ దయాల్ దెబ్బ కొట్టారు. వీళ్లిద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ లయన్స్ పరిమితమైంది. ఈ విజయంతో భారత ఏ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచరీ వీరుడు సర్ఫరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సర్ఫరాజ్ ఖాన్ (161)
భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్లో 152 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ లయన్స్.. రెండో ఇన్నింగ్స్లోనూ కనీస పోరాటం కనబరచలేదు. ఓలీ రాబిన్సన్ 84 నాటౌట్), జోష్ బొహన్నన్(48)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్లో భారత ఏ జట్టు 489 రన్స్ కొట్టింది. రంజీ పరుగుల వీరుడు సర్ఫరాజ్ ఖాన్ (161), దేవ్దత్ పడిక్కల్(105) సెంచరీలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
సౌరభ్ కుమార్
చివర్లో వచ్చిన సౌరభ్ కుమార్(77) అర్ధ శతకం బాదడంతో భారత ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం సౌరభ్ బంతితోనూ చెలరేగడంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇరుజట్ల మధ్య చివరి మ్యాచ్ అహ్మదాబాద్లో ఫిబ్రవరి 1న జరుగనుంది.