హైదరాబాద్: మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నెమ్మదిగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు మొదట్లో గట్టిదెబ్బ తగిలింది. రెండో ఓవర్ లాస్ట్ బాల్కు స్టార్ బాటర్ షఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. 4 పరుగులకే వికోల్పోయిన జట్టును దీప్తి శర్మ, స్మృతి మందన ఆదుకున్నారు. 57 బంతుల్లో 40 పరుగులు చేసిన దీప్తి శర్మ జట్టు స్కోరు 96 పరుగుల వద్ద నష్రా సంధు బౌలింగ్లో రెండో వికెట్గా వెనుతిరిగింది. దీంతో కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీజ్లోకి అడుగుపెట్టింది.
తన చివరి ప్రపంచకప్ ఆడుతున్న మిథాలీ.. ఖాతా తెరవడానికి చాలా కష్టపడింది. పది బాల్స్ ఆడిన తర్వాత తన తొలి రన్ నమోదుచేసింది. ఈ క్రమంలో ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి మందన.. 54 పరుగుల వద్ద మూడో వికెట్గా వెనుతిరిగింది.
ODI fifty number 2⃣1⃣ for Smriti Mandhana!
She has steadied the Indian innings after losing her opening partner early on 👏#CWC22 pic.twitter.com/wadVxO3g24
— ICC Cricket World Cup (@cricketworldcup) March 6, 2022
స్మృతి ఔట్లో క్రీజ్లోకి వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్ కుదురుకోవడానికి కష్టపడింది. అయితే 13 బంతులు ఆడిన కౌర్ 5 పరుగులు చేసి నిదా దార్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయింది. దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 29 ఓవర్లరో 108 రన్స్ చేసింది. ప్రస్తుతం మిథాలీ రాజ్ (5/22), రిచా ఘోశ్ క్రీజ్లో ఉన్నారు.
Nida Dar traps Harmanpreet Kaur for an LBW! 👊
India in slight bother at 108/4.#CWC22 pic.twitter.com/Fx1hvJoE7g
— ICC Cricket World Cup (@cricketworldcup) March 6, 2022