హైదరాబాద్: మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup) భారత్ తన తొలి మ్యాచ్ను దాయాది పాకిస్థాన్తో ఆడుతున్నది. మౌంట్ ముంగనుయ్ వేదిగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. వన్డేల్లో పాక్పై టీమిండియా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన పది వన్డేల్లో భారత్ విజయం సాధించింది. ఇక మహిళల ప్రపంచకప్లోనూ ఆడిన రెండు మ్యాచ్ల్లో టీమిండియా గెలుపొందింది. కెప్టెన్ మిథాలీ రాజ్, దిగ్గజ బౌలర్ జులన్ ఘోస్వామిలకు ఇదే చివరి వరల్డ్కప్ కావడం విశేషం.
కాగా, మహిళల ప్రపంచ వరల్డ్ కప్ 1973లో ప్రారంభమైంది. ఇప్పటివరకు భారత్కు కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రెండుసార్లు ఫైనల్లో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. ఈ సారైన కప్పు సాధించి కెప్టెన్కు ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తున్నది. అయితే తొలి మ్యాచే దాయాది పాక్ ఆడుతుండటంతో ఫలితం ఆసక్తి నెలకొన్నది. ఏ స్థాయి క్రికెట్లోనైనా భారత్, పాక్ మ్యాచ్ అంటే ఆసక్తి రేకెత్తడం సహజం కాగా.. వరల్డ్కప్ కావడం మరింత జోష్ నింపుతున్నది.