కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు నాంది పలుకుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి హర్మన్ప్రీత్ కౌర్ నమ్మకాన్ని ఓపెనర్లు స్మృతి మంధాన (24), షెఫాలీ వర్మ (48) నిలబెట్టారు.
అయితే మంధాన త్వరగా అవుటవడం, ఆ తర్వాత వచ్చిన యాస్తికా భాటియా (8) నిరాశపరచడంతో భారత మహిళలు ఇబ్బందుల్లో పడ్డారు. ఇలాంటి సమయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (52) జట్టును ఆదుకుంది. కానీ జెమీమా రోడ్రిగెజ్ (11), దీప్తి శర్మ (1), హర్లీన్ డియోల్ (7) ఎవరూ ఆమెకు సహకారం అందించలేకపోయారు.
చివరి ఓవర్ ఐదో బంతికి హర్మన్ప్రీత్ కౌర్ అవుటవగా.. ఆ తర్వాతి వచ్చిన మేఘన సింగ్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో జెస్ జొనాసన్ నాలుగు వికెట్లతో రాణించగా.. మేగన్ షుట్ రెండు, డార్సీ బ్రౌన్ ఒక వికెట్ తీసుకున్నారు.
Innings Break!
52 from @ImHarmanpreet & 48 from @TheShafaliVerma propel #TeamIndia to a total of 154/8 on the board.
Over to our bowlers now!
Scorecard – https://t.co/cuQZ7NHmpB #AUSvIND #B2022 pic.twitter.com/DzxUqdFXz0
— BCCI Women (@BCCIWomen) July 29, 2022