కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత సారధి హర్మన్ప్రీత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు స్మృతి మంధాన (24) శుభారంభం అందించినప్పటికీ.. తనకు దక్కిన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన యాస్తికా భాటియా (8) నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడింది.
అయితే 10వ ఓవర్ తొలి బంతికే రనౌట్ రూపంలో వెనుతిరిగింది. ఈ క్రమంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ క్రీజులోకి వచ్చింది. మరో ఎండ్లో షెఫాలీ వర్మ (36 నాటౌట్) రాణిస్తోంది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులతో నిలిచింది. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ను ఈ ఏడాది చేర్చిన సంగతి తెలిసిందే.