IND vs ZIM | టీమిండియాతో మ్యాచ్లో వరుస వికెట్లను కోల్పోతోంది. 7 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లను కోల్పోయింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. ఫస్ట్బాల్కే తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన బంతికి మధువెరె ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ అద్భుతంగా ఒడిసిపట్టాడు. రెండో ఓవర్ పూర్తయ్యేసరికి చకబ్వా డకౌట్అయ్యాడు. వీరిద్దరి తర్వాత క్రీజులోకి వచ్చిన విలయమ్స్ (11) కాసేపు నిలకడగా ఆడిన.. ఆరో ఓవర్లో చివరి బంతికి పెవిలియన్ చేరాడు. ఇక హార్దిక్ వేసిన ఏడో ఓవర్లో నాలుగో బంతికి క్రెయిగ్ ఎర్విన్ (13) ఔటయ్యాడు.
అంతకుముందు జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో ఈ మ్యాచ్లో గెలవాల్సిన అవసరం లేకుండానే టీమిండియా సెమీస్కు చేరింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్ కూడా సెమీస్కు చేరుకుంది.
PAK vs BAN | సెమీస్కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్పై 5 వికెట్ల తేడాతో గెలుపు