వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు శుభారంభం చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు.. హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే మంచి బ్రేక్ ఇచ్చాడు. ప్రమాదకరమైన విండీస్ ఓపెనర్ షాయి హోప్ (8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా శిబిరం సంబరాలు చేసుకుంది.
ఆ తర్వాత మరో వికెట్ పడకుండా బ్రాండన్ కింగ్ (13), డారెన్ బ్రావో (18) అడ్డుకున్నారు. అయితే 12వ ఓవర్లో బంతి అందుకున్న వాషింగ్టన్ సుందర్.. ఆ ఓవర్ రెండో బంతికే బ్రాండన్ను పెవిలియన్ చేర్చాడు. సుందర్ వేసిన బంతిని లెగ్సైడ్ ఆడేందుకు బ్రాండన్ ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ మిడ్వికెట్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ డైవ్ చేస్తూ చక్కిటి క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్రాండన్ ఇన్నింగ్స్ ముగిసింది.
అదే ఓవర్ చివరి బంతికి డారెన్ బ్రావో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. అయితే అంపైర్ అవుట్ ఇవ్వలేదు. సుందర్ నమ్మకాన్ని చూసిన రోహిత్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి నేరుగా వికెట్లను తాకుతున్నట్లు తేలడంతో బ్రావో కూడా వెనుతిరిగాడు. ప్రస్తుతం క్రీజులో నికోలస్ పూరన్, షామర్ బ్రూక్స్ ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 55/3 స్కోరుతో నిలిచింది.