మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో వన్డే సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ సిద్దం అవుతోంది. ఇటీవలే జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టిన విండీస్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్కు మంచి ఆరంభం లభించలేదు. బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 0-3 తేడాతో ఓడిపోయిందా జట్టు. ఇలాంటి సమయంలో భారత్పై ఎలాగైనా సత్తా చాటాలని పూరన్ సేన ఆశిస్తోంది.
ఈ క్రమంలోనే ఆ దేశ క్రికెట్ బోర్డు మొత్తం 13 మందితో జట్టును ప్రకటించింది. వీరిలో వెటరన్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్కు స్థానం కల్పించింది. భారత్ కూడా ఈ సిరీస్కు ఒక విధంగా బి-టీంను పంపుతోంది. శిఖర్ ధావన్ నేతృత్వం వహించనున్న ఈ జట్టు విండీస్తో మొత్తం మూడు వన్డేలు ఆడనుంది.
వెస్టిండీస్ జట్టు: నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయి హోప్ (వైస్ కెప్టెన్), షామార్ బ్రూక్స్, కీసీ కార్టీ, జేసన్ హోల్డర్, అకియల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మైయర్స్, గుండకేష్ మోతీ, కీమో పాల్, రోవ్మెన్ పావెల్, జేడెన్ సీల్స్
రిజర్వ్ ఆటగాళ్లు: రొమేరియో షెపర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్
భారత జట్టు: దీపక్ హుడా, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్
CWI names the 13-player squad to face India in the three-match CG United ODI Series in Trinidad.
Squad Details⬇️ https://t.co/aPveMYcMb8
— Windies Cricket (@windiescricket) July 17, 2022