IND vs WI | కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ముందు వెస్టిండీస్ ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టీమిండియా ముందు 158 పరుగుల టార్గెట్ను ఉంచింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ బ్రెండన్ కింగ్ (4) ఔటయ్యాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ ( 31 ) ఫర్వాలేదనిపించాడు. టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్తో వెస్టిండీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించింది. దీంతో రోస్టన్ ఛేజ్ (4) రోమన్ పావెల్ ( 2), అకీల్ హోసీన్ (10), ఒడియన్ స్మిత్ ( 4) ఏ మాత్రం రాణించలేకపోయారు. నికోలస్ పూరన్ (61) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 157 పరుగులు చేయగలిగింది.