విండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లలో వికెట్ లేని ఒకే ఒక్కడు శార్దూల్ ఠాకూర్. రెండో వన్డేలో తొలి పవర్ప్లేలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయాడు. అదే సమయంలో ప్రసిద్ధ్ కృష్ణ వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్కు మంచి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత చాహల్ కూడా ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు శార్దూల్ కూడా వికెట్ల బాట పట్టాడు.
తొలి వన్డేలో విండీస్ తరఫున ఒంటరి పోరాటం చేసిన జేసన్ హోల్డర్(2)ను సింగిల్ డిజిట్కే పరిమితం చేశాడు. భుజాల ఎత్తులో శార్దూల్ వేసిన బంతిని హోల్డర్ పుల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కంట్రోల్ సరిగా లేకపోవడంతో డీప్ స్క్వేర్ లెగ్లో దీపక్ హుడా క్యాచ్ పట్టేశాడు. దీంతో హోల్డర్ ఇన్నింగ్స్ ముగిసింది. 76 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన విండీస్ జట్టు.. విజయం సాధించడం ఇక కష్టమే. క్రీజులో బ్రూక్స్, అకీల్ హొస్సేన్ ఉన్నారు.