సిరాజ్ వికెట్ తీసిన తర్వాతి ఓవర్లోనే మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కీలక వికెట్ తీశాడు. విండీస్ విజయం కోసం పోరాడుతున్న అకీల్ హొస్సేన్ (34)ను పెవిలియన్ చేర్చాడు. హొస్సేన్ను షార్ప్ బౌన్సర్తో కన్ఫ్యూజ్ చేసిన శార్దూల్.. ఫలితం రాబట్టాడు. సడెన్గా వచ్చిన బౌన్సర్ను పక్కకు నెట్టేందుకు హొస్సేన్ ప్రయత్నించాడు. ఆ సమయంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి వెనక్కు వెళ్లింది.
దాన్ని గమనించిన కీపర్ పంత్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి మరీ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అకీల్ హొస్సేన్ పోరాటం ముగిసింది. అతను నిరాశగా క్రీజు వదలగా.. భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఒడియన్ స్మిత్ వరుస బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. విండీస్ ఇంకా మ్యాచ్ కోసం పోరాడుతోందని సంకేతాలు పంపాడు. 40 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 171/8 స్కోరు చేసింది.