రోహిత్, పంత్, కోహ్లీ వంటి కీలక ఆటగాళ్లంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జట్టు. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ (49), సూర్యకుమార్ యాదవ్ (64) టీమిండియాను ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అయితే రాహుల్ అవుటైన తర్వాత సూర్యతో వాషింగ్టన్ సుందర్ జతకట్టాడు. వీళ్లిద్దరూ కలిసి ఐదో వికెట్కు 43 పరుగులు జోడించిన తర్వాత సూర్య కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో హిట్టర్లు లేని టీమిండియా బ్యాటర్లు నిరాశపరిచారు. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (8) మరోసారి బ్యాటుతో నిరాశపరచగా.. మహమ్మద్ సిరాజ్ (3), చాహల్ (11) పరుగులు చేశారు. దీపక్ హుడా (29) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు.
అతన్ని ఇంకొంచెం ముదు క్రీజులోకి పంపి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదేమో? విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొస్సేన్, ఫాబియాన్ అలెన్ తలో వికెట్ పడగొట్టగా.. అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ ముందు 238 పరుగుల టార్గెట్ ఉంచింది.
Innings Break!#TeamIndia post 237/9 on the board in the 2nd @Paytm #INDvWI ODI!
6⃣4⃣ for @surya_14kumar
4⃣9⃣ for @klrahul11Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/yqSjTw302p pic.twitter.com/uSwZSxYLJt
— BCCI (@BCCI) February 9, 2022