వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియా ఆటగాళ్లు శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యర్ సహా పలువురు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీళ్లిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరికీ తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఇద్దరూ కూడే నరేంద్ర మోదీ స్టేడియంలో లైట్గా ప్రాక్టీస్ కూడా చేశారు.
అయితే వీరితోపాటు కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్ ఇంకా ఐసొలేషన్లోనే ఉన్నాడు. ‘ప్రొటోకాల్ ప్రకారం ధవన్, శ్రేయాస్ ఇద్దరూ లైట్గా ప్రాక్టీస్ చేయడానికి అనుమతి ఉంది. అయితే మెడికల్ టీమ్ వీరిద్దరినీ పర్యవేక్షించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తాం’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు సమాచారం. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ బుధవారం జరిగే రెండో వన్డేలో వీరిద్దరూ ఆడబోరని తెలుస్తోంది.
కాగా, వెస్టిండీస్తో వన్డే సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత జట్టు ఆడిన 100వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్. దీనిలో రోహిత్ సేన ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా పరిమిత ఓవర్ల కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ.. 60 పరుగులతో రాణించి జట్టు విజయానికి బాటలు వేశాడు. అంతకుముందు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో విండీస్ జట్టు 176 పరగులకే కుప్పకూలింది.