ఫ్లోరిడా: భారత్తో జరిగిన చివరి టి20మ్యాచ్లోనూ వెస్టిండీస్కు పరాభవం తప్పలేదు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో ఇండియా 88 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. తొలుత టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేయగా, విండీస్ సరిగా వంద పరుగులు చేసి ఆలౌటైంది. షిమ్రాన్ హెట్మెయిర్ (56) మినహా ఎవరూ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. వికెట్లన్నీ స్పిన్నర్లకే దక్కాయి. రవి బిష్ణోయ్ 4, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఇషాన్ కిషన్ వికెట్ త్వరగానే కోల్పోయినా, శ్రేయస్ (64), దీపక్ హుడా (38) రెండో వికెట్కు 76 పరుగులు జోడించి భారీ స్కోరుకు దోహదం చేశారు. కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా త్వరితగతిన రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 28 పరుగులు జోడించాడు. నిర్ణీత ఓవర్లలో టీమ్ఇండియా 7 వికెట్లకు 188 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు:
ఇండియా-188/7 (శ్రేయస్ అయ్యర్ 64, దీపక్ హుడా 38, హార్దిక్ పాండ్యా 28, ఒడియన్ స్మిత్ 3/33); వెస్టిండీస్-100 ఆలౌట్ (షిమ్రన్ హెట్మెయిర్ 56, రవి బిష్ణోయ్ 4/16, అక్షర్ పటేల్ 3/15, కుల్దీప్ యాదవ్ 3/12).