ఆసియా కప్ ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) నిరాశపరచగా.. ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ (0) డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో జట్టును ముందుండి నడిపించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (29 నాటౌట్) ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లాడు. కోహ్లీ అవుటైన తర్వాత అతనికి జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ (6 నాటౌట్) మంచి సహకారం అందిస్తున్నాడు. దీంతో భారత జట్టు పవర్ప్లే ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 44 పరుగులతో నిలిచింది.
That's the end of the powerplay.#TeamIndia lose two wickets with 44 runs on the board.
Live – https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/UIhgMT1IhU
— BCCI (@BCCI) September 6, 2022