శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (72) అవుటయ్యాడు. కరుణరత్నే వేసిన 13వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. షార్ట్ బాల్ను డీప్ పాయింట్ దిశగా అప్పర్ కట్ ఆడాడు. అయితే షాట్లో సరైన శక్తి లేకపోవడంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న నిస్సంకకు సులభమైన క్యాచ్ అందింది. దీంతో భారత జట్టు 110 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.