కెప్టెన్ అయిన తర్వాత బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ.. బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కూడా మరోసారి విఫలం అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియా బౌలింగ్లో డిసిల్వకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వేసిన టాస్డ్ అప్ డెలివరీని డిఫెండ్ చేసేందుకు ముందుకొచ్చిన రోహిత్.. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు.
దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి గల్లీ పొజిషన్కు సమీపంలో ఉన్న డిసిల్వ వైపు వెళ్లింది. దాన్ని అతను చక్కగా అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ చేరాడు. దీంతో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కోహ్లీ, హనుమ విహారి ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 12 ఓవర్ల తర్వాత భారత జట్టు 31/2 స్కోరుతో నిలిచింది.