IND vs SL : కసున్ రజిత లంకకు నాలుగో వికెట్ అందించాడు. అతని బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్(28) ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్ అవుట్ ఇవ్వడంతో శ్రేయాస్ అయ్యర్ రివ్యూ తీసుకున్నాడు. కానీ, రివ్యూలో బంతి లెగ్ స్టంప్ను తాకింది. దాంతో అయ్యర్ పెవిలియన్ చేరాడు. లంక బౌలర్లు వెంట వెంటనే కీలక వికెట్లు తీయడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. అయ్యర్, కేఎల్ రాహుల్తో కలిసి నాలుగో వికెట్కు 24 పరుగులు జోడించాడు. వీళ్లిద్దరూ సింగిల్స్, డబుల్స్తో పాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ లంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 87 పరుగులు చేసింది.