ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. యువ బ్యాటర్ దీపక్ హుడా (3) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మధుశంక వేసిన 19వ ఓవర్ తొలి బంతిని లెగ్సైడ్ భారీ షాట్ ఆడేందుకు హుడా ప్రయత్నించాడు. ఈ క్రమంలో వికెట్లను వదిలి ఆఫ్సైడ్ వచ్చిన అతను బంతిని కనెక్ట్ చెయ్యలేకపోయాడు. దాంతో అది వికెట్లను కూల్చింది. అదే ఓవర్ మూడో బంతికి రిషభ్ పంత్ (17) కూడా పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ మీదకు వచ్చిన బంతిని లెగ్సైడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన పంత్.. నిస్సంకకు చిక్కాడు. దీంతో భారత జట్టు 158 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.