భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని తెలిసినా పోరాడుతున్నారు. రెండో రోజు చివరకు 28/1 స్కోరుతో ఉన్న లంక.. మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత వికెట్ పడకుండా బ్యాటర్లు జాగ్రత్త పడటంతో 97/1తో నిలిచింది.
అంతకు ముందే ఓపెనర్ కుశాల్ మెండిస్ (54) కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో లంక గట్టిపోటీ ఇస్తుందని అనిపించింది. కానీ అలాంటి సమయంలోనే చూడచక్కని డెలివరీతో అశ్విన్ దెబ్బకొట్టాడు. అతను వేసిన ఫ్లైటెడ్ డెలివరీని సరిగా అంచనా వేయలేక ముందుకొచ్చిన ఆడబోయిన మెండిస్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశాడు.
బంతి అతను అనుకున్నంత టర్న్ అవకపోవడంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని వెనక్కు వెళ్లింది. కీపర్ పంత్ సులభంగా దాన్ని అందుకున్నాడు. ఈ వికెట్తో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాలో సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (439)ను అశ్విన్ సమం చేశాడు. మరొక్క వికెట్ తీశాడంటే స్టెయిన్ను దాటేస్తాడు.
అశ్విన్ వికెట్ తీసిన మరుసటి ఓవర్లోనే జడేజా కూడా సత్తా చాటాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన వెటరన్ ఏంజెలో మాథ్యూస్ (1)ను బోల్తా కొట్టించాడు. బౌలింగ్కు వచ్చినప్పటి నుంచి ఒక బంతిని టర్న్ చేస్తూ, మరో బంతిని స్టెయిట్గా వేస్తూ తికమక పెడుతున్న జడ్డూ.. స్ట్రెయిట్ డెలివరీని మాథ్యూస్ అంచనా వేయలేకపోయాడు. దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లకు తగిలింది. ఐదు బంతులు మాత్రమే ఆడిన మాథ్యూస్ ఇన్నింగ్స్ ముగిసింది.