భారత జట్టు బ్యాటింగ్ లైనప్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని, సఫారీలతో జరిగే రెండో టీ20లో కూడా అదే బ్యాటింగ్ లైనప్తో టీమిండియా బరిలో దిగుతుందని వసీం జాఫర్ అన్నాడు. ప్రపంచకప్లో కూడా మొదటి నాలుగు స్థానాల్లో దిగే బ్యాటర్లు దాదాపు కన్ఫర్మ్ అయిపోయారని చెప్పిన ఈ మాజీ ఓపెనర్.. అందుకే బ్యాటర్ల లైనప్లో మార్పులు ఉండబోవని అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో సఫారీ జట్టులో రీజా హెండ్రిక్స్ను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ప్రపంచకప్ వంటి టోర్నీకి ముందు ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం సరైంది కాదని చెప్పిన జాఫర్.. బవుమా రాకతో హెండ్రిక్స్ను పక్కన పెట్టడాన్ని తప్పుబట్టాడు. కాబట్టి రెండో టీ20లో హెండ్రిక్స్ను ఓపెనర్గా పంపి, బవుమా మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తే మంచిదని సలహా ఇచ్చాడు.