సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్కు భారత జట్టు సిద్ధం అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత జట్టు అరుదైన రికార్డు సాధిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ టీ20 క్రికెట్లో వరుసగా ఎక్కువ మ్యాచ్లు గెలిచిన జట్లలో ఆఫ్ఘనిస్థాన్, రోమేనియా ఉన్నాయి. ఈ రెండు జట్లు వరుసగా 12 టీ20 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేశాయి.
భారత జట్టు కూడా ప్రస్తుతం 12 వరుస విజయాలతోనే ఉంది. టీ20 ప్రపంచకప్లో ఆప్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియాలపై గెలిచిన భారత్.. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిల్యాండ్లతో జరిగిన టీ20 సిరీసులను కూడా 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు సఫారీలతో జరిగే తొలి టీ20 మ్యాచ్లో విజయం సాధిస్తే, వరుసగా 13 టీ20 మ్యాచులు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది.
అయితే ప్రస్తుతం తమ ఫోకస్ అంతా మ్యాచ్ మీదనే ఉందని, ఇలాంటి రికార్డుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు. చక్కగా ప్రాక్టీస్ చేసి, మంచి ప్రణాళికతో మైదానంలో దిగుతామని.. ఆ ప్లాన్ను ఎలా ఎగ్జిక్యూట్ చేశామనేదే ముఖ్యమన్నాడు. అదే సమయంలో రికార్డు సాధిస్తే, అది కూడా మంచిదేనని చెప్పాడు. సౌతాఫ్రికా బలమైన జట్టని, యువ ఆటగాళ్లకు వారితో ఆడే అవకాశం రావడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించాడు.
We have a challenge ahead of us against a strong South African side: #TeamIndia Head Coach Rahul Dravid 💪#INDvSA | @Paytm pic.twitter.com/AFaZ2XTuNn
— BCCI (@BCCI) June 7, 2022
#TeamIndia Head Coach, Rahul Dravid is excited to have someone of @hardikpandya7's quality in the side. 👍 👍#INDvSA | @Paytm pic.twitter.com/dszAELbKwy
— BCCI (@BCCI) June 7, 2022