సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నాడు. బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా భారత జట్టు కేవలం 148 పరుగులు మాత్రమే చేసింది. దాంతో సౌతాఫ్రికా సులభంగా లక్ష్యాన్ని ఛేదిస్తుందని అభిమానులు ఆందోళన చెందారు. అయితే భువనేశ్వర్ తన బౌలింగ్తో సఫారీలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.
తొలి ఓవర్లోనే రీజా హెండ్రిక్స్ (4) వికెట్ తీసిన అతను.. ఆ తర్వాత మూడో ఓవర్లో ప్రిటోరియస్ (4)ను పెవిలియన్ చేర్చాడు. పవర్ప్లే చివరి ఓవర్లో మరోసారి బంతి అందుకొని కీలకమైన వాన్ డర్ డస్సెన్ (1) కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు.
రెండు వైపులా స్వింగ్ చేస్తూ భువీ వేస్తున్న బౌలింగ్ను ఎలా ఎదుర్కోవాలో సఫారీ బ్యాటర్లకు అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలోనే పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Bhuvi picks up his third wicket as Rassie van der Dussen is bowled for just 1 run.
Live – https://t.co/pkuUUB966c #INDvSA @Paytm pic.twitter.com/AYEKuGjYeg
— BCCI (@BCCI) June 12, 2022