భారత్తో జరగుతున్న టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ విజృంభించడంతో పవర్ప్లే ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును కెప్టెన్ బవుమా (35), కీపర్ క్లాసెన్ (49 నాటౌట్) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటమే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు.
ముఖ్యంగా క్లాసెన్ బౌండరీలతో ఎదురు దాడికి దిగాడు. చాహల్, అక్షర్ వేసిన ఓవర్లలో వీళ్లు భారీ షాట్లు ఆడారు. ఇదే ఊపులో చాహల్ వేసిన 13వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన బవుమా.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆడబోయాడు. ఈ క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సఫారీ జట్టు 13 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 98 పరుగులతో నిలిచింది.