సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్ ఆడకుండానే వెన్నునొప్పి కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు దూరమయ్యాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్లో కూడా అతను ఆడటం అనుమానమే. అదే సమయంలో వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కూడా కరోనాతో బాధపడుతున్నాడు.
అతను ఎప్పుడు కోలుకుంటాడో ఇంకా తెలీదు. ఈ క్రమంలో సఫారీ టూర్లో బుమ్రా స్థానంలో హైదరబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సౌతాఫ్రికా జట్టుతో గువాహటి, ఇండోర్ వేదికలుగా జరిగి రెండు టీ20 మ్యాచుల్లో బుమ్రా స్థానంలో సిరాజ్ ఆడనున్నాడు. అయితే అతను చివరి 11 మందిలో ఉంటాడా? అన్నది అనుమానమే.
దీపక్ చాహర్, అర్షదీప్ సింగ్ తొలి మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేయడంతో వారినే మిగతా మ్యాచుల్లో కూడా టీమ్ మేనేజ్మెంట్ కొనసాగించే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ నాటికి షమీ కోలుకుంటే.. బుమ్రా స్థానంలో అతన్ని ఆడిస్తారని సమాచారం. ఒకవేళ షమీ కూడా కోలుకోకుంటే యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతన్ని స్టాండ్బైగా ఉండాలని బీసీసీఐ కోరిందట.
🚨 NEWS 🚨: Mohd. Siraj replaces injured Jasprit Bumrah in T20I squad. #TeamIndia | #INDvSA
More Details 🔽https://t.co/o1HvH9XqcI
— BCCI (@BCCI) September 30, 2022