భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. గురువారం జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహించబోతున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, జడేజా వంటి సీనియర్లకు ఈ సిరీస్లో విశ్రాంతినిచ్చారు. చాలాకాలం తర్వాత ఆడియన్స్తో జరిగే మ్యాచ్ కావడంతో టికెట్లన్నీ ఇప్పటికే దాదాపు అమ్ముడుపోయాయి.
ఇదే సమయంలో మ్యాచ్ చూసే ప్రేక్షకుల కోసం ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క ఎయిర్పోర్టు రూట్ తప్ప మిగతా అన్ని రూట్లలో మెట్రో టైమింగ్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. వయలెట్ లైన్లో చివరి రైలు రాత్రి 12 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. దీని వల్ల మ్యాచ్ చూసి తిరిగి వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపింది.