దుబాయ్: దాయాదుల పోరులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థశతకంతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కోహ్లీ ఆదుకున్నాడు. రిషభ్ పంత్ (39)తో కలిసి 50 పరుగులు విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. పంత్ అవుటైన తర్వాత జడేజా (9 నాటౌట్)తో కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో 45 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకున్నాడు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రోహిత్ (0) డకౌట్ కాగా, మూడు పరుగులకే రాహుల్ కూడా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ (11) మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను నిరాశ పరిచాడు.