IND vs PAK : పొట్టి ప్రపంచకప్లో భారత్తో జరిగిన తొలి మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ హాఫ్ సెంచరీ (68) కొట్టింది. దాంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. పూజా వస్త్రకార్ వేసిన 18వ ఓవర్లో ఫోర్ బాది మరూఫ్ ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. అయేషా నసీం (43) తో కలిసి ఐదో వికెట్కు 81రన్స్ జోడించింది. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి స్కోర్బోర్డు వంద దాటించారు. భారత్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా కూడా ఈ ఇద్దరిని ఔట్ చేయలేకపోయారు.
పాకిస్థాన్ 68 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడింది. 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 రన్స్ చేసింది. అయేషా కూడా చక్కని సహకారం అందించింది. ఓపెనర్ జవేరియా ఖాన్ (8), మునీబ ఆలీ (12), నిడా దార్ (0) స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో రాధ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ, పూజా వస్త్రకార్ తలా ఒక వికెట్ తీశారు.