దుబాయ్: చిరకాల ప్రత్యర్థితో జరుగుతున్న మ్యాచ్లో భారత్ మరో వికెట్ కోల్పోయింది. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ (39) అవుటయ్యాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పంత్ వెనుతిరిగాడు. భారత జట్టు 84 పరుగుల వద్ద పంత్ వికెట్ కోల్పోయింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రోహిత్ (0) డకౌట్ కాగా, మూడు పరుగులకే రాహుల్ కూడా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ (11) మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను నిరాశ పరిచాడు. ప్రస్తుతం కోహ్లీ (30 నాటౌట్), జడేజా క్రీజులో ఉన్నారు.