అహ్మదాబాద్: ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లు కూడా తాము ఆడిన తొలి రెండు మ్యాచ్లలో విజయం సాధించి మంచి ఊపు మీదున్నాయి. ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్పై ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి ఏడింటిలో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్లో కూడా గెలిచి ఆ రికార్డును 8-0కు పెంచుకోవాలని ఆరాటపడుతోంది. అటు పాకిస్థాన్ మాత్రం ఈ సారి భారత్పై ఎలాగైనా గెలిచి.. ప్రపంచకప్లో ఇండియాపై ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదన్న చెత్త రికార్డును చెరిపేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.