మోకాలి గాయంతో ఆసియా కప్ నుంచి వైదొలగిన పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీని భారత స్టార్ ఆటగాళ్లు పరామర్శించారు. టోర్నీ నుంచి దూరమైనప్పటికీ.. జట్టుతో కలిసి యూఏఈ చేరుకున్న షహీన్ను భారత ఆటగాళ్లు పలకరించారు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేసింది. ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రాక్టీస్కు వెళ్లే ముందు షహీన్ను చాహల్ పలకరించాడు. అతనితో మాట్లాడి కాలి గురించి అడిగాడు. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్ కూడా అతనితో మాట్లాడారు. రిషభ్ పంత్తో కూడా మాట్లాడిన అఫ్రిదీ.. తను కూడా బౌలింగ్ మానేసి బ్యాటర్గా మారాలని అనుకుంటున్నానని, పంత్లా ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టాలని ఉందని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.