భారత్తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. సీమర్లకు పిచ్ నుంచి సహకారం ఉంటుందని మాజీలు చెప్తున్నారు.
ఇలాంటి పిచ్పై టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన దహానీ స్థానంలో హస్నయిన్ ఆడుతున్నట్లు చెప్పాడు. తాను టాస్ గెలిచి ఉన్నా బౌలింగే ఎంచుకునే వాడినని భారత సారధి రోహిత్ శర్మ చెప్పాడు. ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకొని జట్టులో కొన్ని మార్పులు చేశామని చెప్పాడు. హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవి బిష్ణోయి ఆడుతున్నారని వెల్లడించారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
పాకిస్తాన్ జట్టు: మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహమ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్, మహమ్మద్ హస్నయిన్, నసీమ్ షా
Three changes for #TeamIndia going into this game.
Deepak Hooda, Hardik Pandya and Ravi Bishnoi come in the Playing XI.
Live – https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/ZeimY92kpW
— BCCI (@BCCI) September 4, 2022