టీ20 ప్రపంచకప్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. కివీస్తో టీ20 సిరీస్లో భాగంగా జైపూర్లో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా సారధి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఇక్కడ తర్వాత మంచు ప్రభావం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ఫీల్డింగ్ ఎంచుకుంటుందని అందరూ అనుకున్నారు. రోహిత్ శర్మ అదే నిర్ణయం తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి రెగ్యులర్ ఆటగాళ్లు లేకపోవడంతో ఈ సిరీస్ టీమిండియా బెంచ్ సామర్ధ్యాన్ని తెలుపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. తొలిసారి టీమిండియా పిలుపు అందుకున్న వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్లోనే ఆడుతున్నట్లు రోహిత్ వెల్లడించాడు.
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్
న్యూజిల్యాండ్: మార్టిన్ గప్తిల్, డారియల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మ్యాన్, టిమ్ సెఫెర్ట్, రాచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, టాడ్ ఆస్లే, లోకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్