న్యూజిల్యాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. తమ స్పిన్నర్లపై ఒత్తిడి పెంచాడని కివీస్ బ్యాటర్ డారియల్ మిచెల్ అన్నాడు. వాంఖడే స్టేడియంలోని పిచ్పై ఎలా బ్యాటింగ్ చేయాలో మయాంక్ చూపించాడని మెచ్చుకున్నాడు.
‘ఎన్నో సవాళ్లు విసురుతున్న ఈ పిచ్పై.. మయాంక్ మా స్పిన్నర్లపై ఒత్తిడి పెంచాడు. బంతి చాలా బాగా టర్న్ అవుతోంది’ అని చెప్పాడు. ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతున్న భారత్-కివీస్ రెండో టెస్టులో ఓపెనర్ మయాంక్ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో పుజారా, కోహ్లీ వంటి సీనియర్లు డకౌట్ అయినా చెక్కుచెదరకుండా చెలరేగాడు.
ఆ ఇన్నింగ్స్లో ఏకంగా 150 పరుగులు చేశాడు. ఆ తర్వాత కివీ బ్యాటర్లు 62 పరుగులకే ఆలౌట్ అయిన చోట తను మాత్రం చాలా సంయమనంతో ఆడాడు. రెండో ఇన్నింగ్స్లో 62 పరుగులు చేశాడు. న్యూజిల్యాండ్కు భారత్ భారీ లక్ష్యం నిర్దేశించడంలో మయాంక్ పాత్ర చాలా ఉంది.