Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్లో నేపాల్పై (Nepal) భారత్ (India) విజయం దిశగా దూసుకెళ్తున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నేపాల్కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. అయితే భారత బౌలర్లు క్రమంగా పట్టు బిగించడంతో పరులు చేయడానికి శ్రమిస్తున్నారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయడంతో నేపాల్ 4 వికెట్లకు 77 పరుగులు చేసింది. అంతకుముందు సాయి కిశోర్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం నేపాల్ 4 వికెట్లకు 88 రన్స్ చేసింది.