IND vs NED: వన్డే ప్రపంచకప్లో భారత అప్రతీహాత జైత్రయాత్ర వెనుక బ్యాటర్ల కష్టానికంటే ఎక్కువ బౌలర్ల గురించే చెప్పుకోవాలన్నది ఎవరూ కాదనలేనిన నిజం. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వంటి పటిష్ట బ్యాటింగ్ లైనప్కు చుక్కలు చూపెట్టిన మన బౌలర్లు నెదర్లాండ్స్ వంటి అనామక జట్టుపై ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. బంతి చేతికిస్తే వికెట్ తీయడం తప్ప మరే పని తెలియదన్నట్టుగా చెలరేగిపోతున్న సిరాజ్, షమీ, బుమ్రాలతో పాటు బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్లను గిరాటేసే కుల్దీప్, రవీంద్ర జడేజాలు డచ్ టీమ్ను ఆలౌట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు.
బెంగళూరులో నెదర్లాండ్స్ను ఔట్ చేయడానికి భారత్ 40 ఓవర్లలోపు ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను వాడింది. బౌలింగ్ చేయనివారిలో కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే ఉన్నారు. టీమిండియా రెగ్యులర్ బౌలర్లు బుమ్రా, సిరాజ్, షమీ, కుల్దీప్, జడ్డూలతో పాటు ఈ మ్యాచ్లో కొత్తగా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేశాడు. అతడు ఓ వికెట్ కూడా తీయడం గమనార్హం. ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసిన కోహ్లీ.. 13 పరుగులిచ్చి ఒక్క వికెట్ (నెదర్లాండ్స్ సారథి స్కాట్ ఎడ్వర్డ్స్) కూడా తీశాడు.
More bowling options in Bengaluru 👌👌
Shubman Gill 🤝 Suryakumar Yadav
Follow the match ▶️ https://t.co/efDilI0KZP#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/Zlt7EzlqFW
— BCCI (@BCCI) November 12, 2023
బెంగళూరు పిచ్ చిన్నదే గాక బ్యాటింగ్కు అనుకూలించేది కావడంతో డచ్ బ్యాటర్లు కూడా అంత ఈజీగావికెట్ పారేసుకోవడం లేదు. దీంతో రోహిత్.. పార్ట్ టైమర్లను బంతినిచ్చాడు. భారత అభిమానులు ఎప్పుడూ చూడని విధంగా శుభ్మన్ గిల్తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా తలా రెండు ఓవర్లు విసిరారు. గిల్ రెండు ఓవర్లలో 11 పరుగులివ్వగా.. సూర్య 17 పరుగులిచ్చాడు. వీళ్లంతా బౌలింగ్ చేయడంతో బెంగళూరు క్రౌడ్.. రోహిత్ కూడా బౌలింగ్ చేయాలని అరవడం గమనార్హం. అంతకుముందు వీళ్లే కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలని నినాదాలు చేయడంతో రోహిత్.. విరాట్కు బంతినిచ్చాడు. 40 ఓవర్లకు నెదర్లాండ్స్.. ఆరు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పది ఓవర్లలో ఆ జట్టు 220 పరుగులు చేయాల్సి ఉంది.