ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. టాపార్డర్తోపాటు మిడిలార్డర్ కూడా పూర్తిగా విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (11) మరోసారి నిరాశ పరచగా.. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (15) కూడా విఫలమయ్యాడు. ఆండర్సన్ వేసిన షార్ట్ బాల్ని ఆడలేక పెవిలియన్ చేరాడు.
మీదకు వచ్చిన షార్ట్ బంతిని వెనక్కు నెట్టేందుక అయ్యర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కీపర్ శామ్ బిల్లింగ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పంత్, జడేజా క్రీజులో ఉన్నారు.