ఇంగ్లండ్ టెస్టులో భారత బ్యాటింగ్ మరోసారి తడబడుతోంది. ఆరంభంలోనే వేగంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను పంత్, జడేజా ఆదుకున్నారు. పంత్ సెంచరీతో చెలరేగాడు. అయితే రూట్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (1) విఫలమయ్యాడు. ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్ వేసిన 68వ ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు.
మీదకు వచ్చిన బౌన్సర్ను గాల్లోకి లేచి మరీ కిందకు ఆడేందుకు ప్రయత్నించిన శార్దూల్ విఫలమయ్యాడు. దాంతో అతని గ్లవ్స్ను తాకిన బంతి కీపర్ వైపు దూసుకెళ్లింది. దాన్ని శామ్ బిల్లింగ్స్ చక్కగా అందుకోవడంతో 323 పరుగుల వద్ద భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది.